దుబాయ్: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ పోరులో పాకిస్థాన్ జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్ (17 నాటౌట్), మహమ్మద్ రిజ్వాన్ (25 నాటౌట్) పాకిస్థాన్కు మంచి ఆరంభం అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో పాక్ జట్టు 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమీ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్మెన్ వికెట్ల కోసం భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు.
ఉత్కంఠ భరితంగా సాగుతున్న భారత్, పాకిస్థాన్ టీ20 మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన భారత్ 151 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ (57), రిషభ్ పంత్ (39) రాణించగా మిగతా ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేదు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లో రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా, మూడో ఓవర్లో రాహుల్ (3) పెవిలియన్ చేరాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (11) కూడా అవుటయ్యాడు. ఇలా భారత బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టిన వేళ విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు.
ఆదిలోనే ఇండియాకు దెబ్బ తగలడంతో భారత్ స్కోర్ నెమ్మదిస్తోంది. ఏది ఏమైనా.. టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకుంటున్నాడు. దీంతో 15 ఓవర్లకు భారత్.. 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 37 పరుగులు చేశాడు. జడేజా 8 బంతుల్లో 6 పరుగులు చేశాడు. ఇప్పటికే ఇండియా ఇద్దరు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్లను కోల్పోయింది.
చిరకాల ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ (39) అవుటయ్యాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పంత్ వెనుతిరిగాడు. భారత జట్టు 84 పరుగుల వద్ద పంత్ వికెట్ కోల్పోయింది.
భారత్, పాక్ మధ్య హైఓల్టేజ్ పోరు నరాలు తెగే ఉత్కంఠతో సాగుతోంది. టాస్ గెలిచిన పాక్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా తొలి ఓవర్లోనే భారత్కు అత్యంత కీలకమైన రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో ఫామ్లో ఉన్న రాహుల్ (3) కూడా పెవిలియన్ చేరాడు. వీరిద్దరినీ షాహీన్ అఫ్రిదీనే అవుట్ చేశాడు.
భారత జట్టు పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.
దుబాయ్: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే హిట్ మ్యాన్ రోహిత్ (0) వికెట్ కోల్పోయిన భారత జట్టు మూడో ఓవర్లోనే ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ (3) వికెట్ కూడా కోల్పోయింది.
దుబాయ్: ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్లో భారత అభిమానులకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ (0) తాను ఎదుర్కొన్న తొలిబంతికే డకౌట్గా వెనుతిరిగాడు. దీంతో భారత్ ఒక రన్కే ఒక వికెట్ కోల్పోయినట్లయింది. ఓపెనర్లుగా రోహిత్తోపాటు రాహుల్ దిగాడు.
వచ్చేసింది.. ఆ సమయం వచ్చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా 16వ మ్యాచ్ కొద్దిసేపట్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగనుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్కు సిద్ధమవుతోంది.
టీమిండియా ప్లేయర్లలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యాదవ్, పంత్, పాండ్యా, జడెజా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, షమీ, బుమ్రా.. పాకిస్థాన్తో మ్యాచ్ ఆడనున్నారు.
పాకిస్థాన్ ప్లేయర్లలో బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, జమాన్, హఫీజ్, మాలిక్, ఏ అలీ, ఎస్ ఖాన్, వాసిమ్, హెచ్ అలీ, హెచ్ రౌఫ్, ఎస్ అఫ్రిదీ ఈ మ్యాచ్ ఆడనున్నారు.
ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. రెండు కళ్లతో కాదు.. వేయి కళ్లతో అందరూ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు భారత్, పాక్ మ్యాచ్ ప్రారంభం అవుతుందా అని. ఇక.. మన టీమిండియా ఆటగాళ్లు కూడా పాక్ను ఢీకొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ మ్యాచ్కు సంబంధించిన క్యాంపెయిన్ కోసం టీమిండియా ఆటగాళ్లు కెమెరాలకు పోజులిచ్చారు. దానికి సంబంధించిన వీడియోను ఐసీసీ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. ది బాయ్ ఇన్ బ్లూ.. అంటూ ఇండియన్ ఫ్లాగ్ను జత చేస్తూ ఈ వీడియోను షేర్ చేసింది.
దుబాయ్: క్రికెట్ ప్రపంచంలో అత్యంత హీట్ పుట్టించే మ్యాచ్ దాయాదుల పోరే. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ టెన్షన్ వేరు. ఇలాంటి మ్యాచుల్లో భారత మాజీ సారధి మహేంద్ర సింగ్కు ఒక అభిమాని తయారయ్యాడు. అతనే మహమ్మద్ బషీర్ బొజాయ్ అలియాస్ చాచా చికాగో.
ధోనీ వీరాభిమాని అయిన ఈ పాకిస్థానీ ఇప్పుడు దుబాయ్ చేరుకున్నాడు. ‘భారత జట్టులోకి మెంటార్గా మళ్లీ ధోనీ వచ్చాడుగా. అందుకే నేనూ వచ్చేశా. దుబాయ్లో ల్యాండ్ అవగానే తనకు మెసేజ్ చేశా. కరోనా నిబంధనల వల్ల ధోనీని కలవడం కుదరదు. ధోనీ ఈసారి కూడా నాకు టికెట్లు తీసి ఉంచాడని ఆశిస్తున్నా’ అని చాచా చికాగో చెప్పాడు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి
ఇవాళ భారత్ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచం భారత్, పాక్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. నిజానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదు. దానికంటే ఎక్కువ. ఇతర క్రికెట్ మ్యాచ్లకు, భారత్, పాక్ మ్యాచ్కు చాలా తేడా ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమే ఎదురు చూస్తోందంటే ఈ మ్యాచ్ ఎంత హైఓల్టేజ్ ఉన్న మ్యాచో అర్థం చేసుకోవచ్చు.
ఇవాళ భారత్ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచం భారత్, పాక్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. నిజానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదు. దానికంటే ఎక్కువ. ఇతర క్రికెట్ మ్యాచ్లకు, భారత్, పాక్ మ్యాచ్కు చాలా తేడా ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచమే ఎదురు చూస్తోందంటే ఈ మ్యాచ్ ఎంత హైఓల్టేజ్ ఉన్న మ్యాచో అర్థం చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ind vs Pak | ధోనీ వచ్చాడుగా నేనూ అందుకే వచ్చా: వీరాభిమాని చాచా చికాగో
Ind vs Pak | ‘రాహుల్ ఈ మ్యాచ్ ఆడకు.. మహీ ఇదొక్కటి వదిలెయ్’.. పాక్ అభిమానుల వేడుకోలు!
Sand Art: నేటి భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై పట్నాయక్ సుందర సైకత శిల్పం
Ind Vs Pak | పాక్పై పరుగులు చేయడం కోహ్లీకి చాలా ఇష్టం.. వెల్లడించిన చిన్ననాటి కోచ్
Ind Vs Pak | గెలవాలంటే భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వండి.. షోయబ్ అక్తర్ సలహా