దుబాయ్: క్రికెట్ ప్రపంచంలో అత్యంత హీట్ పుట్టించే మ్యాచ్ దాయాదుల పోరే. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ టెన్షన్ వేరు. ఇలాంటి మ్యాచుల్లో భారత మాజీ సారధి మహేంద్ర సింగ్కు ఒక అభిమాని తయారయ్యాడు. అతనే మహమ్మద్ బషీర్ బొజాయ్ అలియాస్ చాచా చికాగో.
ధోనీ వీరాభిమాని అయిన ఈ పాకిస్థానీ ఇప్పుడు దుబాయ్ చేరుకున్నాడు. ‘భారత జట్టులోకి మెంటార్గా మళ్లీ ధోనీ వచ్చాడుగా. అందుకే నేనూ వచ్చేశా. దుబాయ్లో ల్యాండ్ అవగానే తనకు మెసేజ్ చేశా. కరోనా నిబంధనల వల్ల ధోనీని కలవడం కుదరదు. ధోనీ ఈసారి కూడా నాకు టికెట్లు తీసి ఉంచాడని ఆశిస్తున్నా’ అని చాచా చికాగో చెప్పాడు.
గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ వీడ్కోలు పలికినప్పుడు ఈ వీరాభిమాని కూడా గట్టి శపథం చేశాడు. ఇకపై భారత్-పాక్ మ్యాచులేవీ తాను చూడబోనని ప్రకటించాడు. అయితే టీ20 ప్రపంచకప్ కోసం మెంటార్గా భారత జట్టులో ధోనీ చేరడంతో మళ్లీ చాచా చికాగో కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు చూడటం కోసం దుబాయ్ చేరుకున్నాడు.
ఇలా చేరుకున్న అతను సగం భారత్, సగం పాకిస్థాన్ జెర్సీలు కలిసి ఉన్న టీషర్టు వేసుకొని ఫొటోలు షేర్ చేశాడు. అలాగే రెండు జట్ల రంగులతో ఉన్న ఫేస్ మాస్కులు కూడా తన వెంట తెచ్చుకున్నాడు. వీటి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.