కరీంనగర్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ) : హైడ్రాతో పేదల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. చివరికి పండుటాకులపైనా పంజా విసురుతున్నది. వారి సంక్షేమం కోసం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు కక్ష పూరితంగా సబ్స్టేషన్కు అప్పగిస్తున్నది. తమ స్థలాన్ని తమకే వదిలేయాలని ఎదురుతిరుగుతు న్న వృద్ధులను బెదిరిస్తున్నది. పోలీసుల పహారా, సీ సీ కెమెరాల మధ్య సబ్స్టేషన్ పనులు కొనసాగిస్తున్నది. ఈ నిర్వాకం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రా తినిధ్యం వహిస్తున్న వేములవాడ నియోజకవర్గం లో జరుగుతున్నది. వృద్ధుల సంక్షేమానికి కేటాయించిన స్థలంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేయొద్దని, ప్ర త్యామ్నాయ స్థలం చూపిస్తూ పంచాయతీ తీర్మానం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని లింగంపేటలో 2010లో చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం ఏర్పాటైంది. గ్రామానికి చెందిన దప్పుల అశోక్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. సంఘం ద్వారా వృద్ధులకు అందుతున్న సేవలను గుర్తించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. నియోజకవర్గంలోని చందుర్తి, కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లి, రుద్రంగి, వేములవాడ తదితర మండలాల్లో 80 అనుబంధ సంఘాలు ఏర్పాటై వాటిలో 20 వేల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. సంఘానికి బీఆర్ఎస్ సర్కార్ 2017లో అదే గ్రామంలో ఐదెకరాల స్థలం కేటాయించింది. అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఆ స్థలంలో నిర్మాణాల కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారు. తర్వాత దాతల సాయం మొత్తం రూ.36 లక్షలతో చదునుచేసి షెడ్డు నిర్మించుకున్నారు. సంఘం సేవలను గుర్తించిన నాటి మంత్రి కేటీఆర్ చార్వాక ట్రస్ట్కు సహాయ సహాకారాలు అందించాలని అప్పటి కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించగా రూ.4.50 కోట్లు మంజూరు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది.
సంఘానికి కేటాయించిన స్థలంలోనే సబ్స్టేషన్ నిర్మించేందుకు 2025లో నాటి కలెక్టర్ సందీప్కుమార్ ఝా 20 గుంటలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇది అన్యాయమంటూ సబ్స్టేషన్ నిర్మాణానికి గ్రామ పరిధిలోనే అనేక చోట్ల ప్రభుత్వ భూములున్నాయని, అందులో నిర్మాణం చేయాలంటూ పంచాయతీ తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపింది. కొద్దిరోజులు సైలెంట్గా ఉన్న అధికారులు తాజాగా పనులు మొదలు పెట్టారు. వృద్ధులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో వృద్ధులు అక్కడే దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి ఆ స్థలాన్ని తీసుకోమని, ప్రత్యామ్నాయ స్థలంలోనే నిర్మిస్తామని పేర్కొంటూ వారిని దీక్ష విరమింపచేశారు. తాజాగా సంఘం స్థలంలోనే సబ్స్టేషన్ పనులు చేపట్టారు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి, పోలీస్ పహారా నడుమ పనులు సాగిస్తున్నారు. అటువైపుగా వస్తే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్ బీఆర్ఎస్కు చెందిన వ్యక్తి కావడంతో కక్ష గట్టి కాంగ్రెస్ సర్కార్ ఆ స్థలాన్ని లాక్కుంటున్నదని, ఈ విషయంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తమను నమ్మించి మోసం చేశాడని వృద్ధులు మండిపడుతున్నారు.
వృద్ధాప్యంలో అండగా ఉండేందుకు చార్వాక వృ ద్ధుల సంక్షేమ సంఘాన్ని ఏ ర్పాటు చేసుకున్నం. మా ఫౌండేషన్ ఎదురుగా సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడమేగాక మా ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే చూస్తున్నరు. మా స్థలాన్ని తీసుకోమని చెప్పి ఇ ప్పుడు పోలీసుల నిర్బంధంలో సబ్స్టేషన్ కడుతున్నడు. ఇంత చేస్తున్న ఆది శ్రీనివాస్కు ముసలోళ్ల గోస తగులుతది.
– ఉచ్చిడి రాజిరెడ్డి, చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
బీఆర్ఎస్ హయాంలో నేను రుద్రంగి ఏఎంసీ చైర్మన్గా సేవలందించా. గతంలో ఆ ది శ్రీనివాస్ అక్రమాలపై ప్రశ్నించా. అందుకే ఆయన నాపై, ట్రస్ట్ సభ్యులపై కక్షతో అక్రమ కేసులు పెట్టిస్తున్నడు. గత ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమిని కుట్రలో భాగంగానే ఆన్లై న్ నుంచి తొలగించాడు. నేను స్థాపించిన చార్వాక వృద్ధాశ్రమ సొంత స్థలంలోని కా ర్యాలయానికి ఎదురుగా సబ్ స్టేషన్ కడుతున్నడు. సీసీ కెమెరాలు, పోలీసులను పెట్టి మమ్మల్ని పనులు చేయిస్తున్నడు.
– దప్పుల అశోక్, చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు(లింగంపేట)