దుబాయ్: క్రికెట్ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. గెలుపు కోసం పాక్ జట్టుకు కొన్ని సలహాలు ఇచ్చాడు.
‘మొదటి పని, భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వడం. రెండు, రెండ్రోజుల పాటు కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వాడకుండా ఆపడం. మూడు, టీమిండియా మెంటార్ ధోనీ బ్యాటింగ్కు రాకుండా అడ్డుకోవడం. ఎందుకంటే ఇప్పటికీ ఆ జట్టులో అద్భుత ఫామ్లో ఉన్న ఆటగాడు అతనే’ అని అక్తర్ హిలేరియస్ సలహా ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెడీ వ్యాఖ్యలు చేశాడు.
ఆ తర్వాత సీరియస్గా మారిన ఈ రావల్పిండి ఎక్స్ప్రెస్.. ‘పాక్ జట్టు మంచి ఆరంభం కోసం చూడాలి. మొదటి 5-6 ఓవర్ల పాటు బంతికి ఒక్కో పరుగే చేసినా సరే డాట్ బాల్స్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత రన్రేట్ పెంచాలి. మంచి స్కోర్ సాధిస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవడం సులభం. బౌలర్లు వికెట్ల కోసం ప్రయత్నించాలి’ అని పాకిస్థాన్ జట్టుకు అక్తర్ సలహా ఇచ్చాడు.
పాక్ జట్టులో ట్రంప్ కార్డ్ ఎవరు అని అడగ్గా ఆసిఫ్ అలీ పేరు చెప్పాడు. అతను లోయర్ ఆర్డర్లో బంతిని బాగా బాదగలడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.