WPL 2024 : శ్రీలంక ఆల్రౌండర్ చమరి ఆటపట్టు(Chamari Athapaththu) లక్కీ చాన్స్ కొట్టేసింది. తాజాగా ఐసీసీ ‘మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డుకు ఎంపికైన ఆమె ప్రతిష్ఠాత్మక మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఆడనుంది. ఈ స్టార్ ఆల్రౌండర్ యూపీ వారియర్స్(UP Warriorz) ఫ్రాంచైజీ తరఫున తడాఖా చూపించనుంది. ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్(Lauren Bell) స్థానంలో చమరి ఆటపట్టు ఆడనుందని శుక్రవారం యూపీ మేనేజ్మెంట్ వెల్లడించింది.
‘డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ నుంచి ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ వైదొలిగింది. దాంతో, ఆమె స్థానంలో చమరి ఆటపట్టును తీసుకున్నాం అని యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘మహిళల ప్రీమియర్ లీగ్లో ఆడే అవకాశం దక్కినందుకు చాలా గర్వంగా ఉంది. యూపీవారియర్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. కోచ్ జాన్ లెవిస్, కెప్టెన్ అలీసా హేలీతో కలిసి ఈసారి ట్రోఫీ గెలిచేందుకు నావంతు సహకారం అందిస్తా’ అని ఈ శ్రీలంక కెప్టెన్ తెలిపింది.
Outstanding with the bat, and an outstanding leader for Sri Lanka 👏
Chamari Athapathu was almost faultless in 2023 on the way to the ICC Women’s ODI Cricketer of the Year award 🏆
More ➡ https://t.co/ElmfdWDd7R pic.twitter.com/gYJJJ2xGhB
— ICC (@ICC) January 26, 2024
నిరుడు ముంబైలో జరిగిన రెండో సీజన్ మినీ వేలంలో పవర్ హిట్టర్ అయిన ఆటపట్టు భారీ ధర పలుకుందని భావించారంతా. కానీ ఆశ్చర్యంగా ఆమెను కొనేందుకు ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు యూపీ రూ.30 లక్షల కనీస ధరకు ఆమెతో ఒప్పందం చేసుకొని.. 58వ నంబర్ జెర్సీని కేటాయించింది. నిరుడు మహిళల బిగ్బాష్ లీగ్(WBBL)లో ఆటపట్టు దంచికొట్టింది. మొత్తం 14 ఇన్నింగ్స్ల్లో 552 రన్స్ చేసి రెండో టాప్ స్కోరర్గా నిలిచింది. అంతేకాదు బంతితోనూ రాణించి 9 వికెట్లు పడగొట్టింది.
After topping the charts and winning hearts across leagues 🫡💯
Chamari is now a Warrior 💛💜#UPWarriorzUttarDega #ChangeTheGame #CapriSports pic.twitter.com/nSjbjqRy65
— UP Warriorz (@UPWarriorz) January 26, 2024
యూపీ వారియర్స్ స్క్వాడ్ : అలీసా హేలీ(కెప్టెన్), అంజలీ సర్వానీ, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్, కిరణ్ నవ్గిరే, చమరి ఆటపట్టు, లక్ష్మి యాదవ్, పర్షవీ చోప్రా, రాజేశ్వరీ గైక్వాడ్, యశశ్రీ, శ్వేతా షెరావత్, సోఫీ ఎక్లిస్టోన్, తహ్లియా మెక్గ్రాత్, డానీ వ్యాట్, వ్రిందా దినేశ్, సైమా థాకూర్, గౌహెర్ సుల్తానా, పూనమ్ ఖెమ్నర్.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో యూపీ వారియర్స్ ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత వెనకబడింది. చివరకూ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండో సీజన్ ఫిబ్రవరి 23న షురూ కానుంది. తొలి సీజన్ ముంబైకే పరిమితమైన నేపథ్యంలో ఈసారి టోర్నీని బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో యూపీ తలపడనుంది.