IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు(Team India) భారీ ఆధిక్యంవైపు పయనిస్తోంది. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేస్తూ కేఎల్ రాహుల్(86 : 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (81 నాటౌట్: 155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కదం తొక్కారు. దాంతో, రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. దాంతో, రోహిత్ సేన 175 రన్స్ ఆధిక్యంలో నిలిచింది.
రాహుల్ ఔటయ్యాక.. ఆల్రౌండర్ అక్షర్ పటేల్(35 నాటౌట్)తో కలిసిన జడేజా ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. చివరి 5 ఓవర్లలో గేర్ మార్చిన అక్షర్ ధనాధన్ ఆడడంతో భారత్ స్కోర్ 400 దాటింది. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్కు 63 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హర్ట్లే, జో రూట్ రెండేసి వికెట్లు తీశారు.
Axar Patel ends the day in style! 🚀
(via @BCCI) #INDvENG pic.twitter.com/1OxLJrYWaN
— ESPNcricinfo (@ESPNcricinfo) January 26, 2024
ఓవర్నైట్ స్కోర్ 119/1తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తొలి సెషన్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(80), శుభ్మన్ గిల్(23) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్(86) మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(35)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. వీళ్లిద్దరూ ఆచితూచి ఆడి జట్టు స్కోర్ 200 దాటించారు. అయితే.. రెహాన్ అహ్మద్ బౌలింగ్ అయ్యర్ ఔట్ అయిన కాసేపటికే హర్ట్లే ఓవర్లో రాహుల్ వెనుదిరిగాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, జడేజా అసమాన పోరాటంతో భారత్ ఆధిక్యాన్ని 150 దాటించారు.