AP News | చంద్రబాబు, పవన్కళ్యాణ్ డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. రాజానగరం, రాజోలు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకే వదిలేశారని తెలిపారు. తనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారని అన్నారు. జనసేన నేతాల్లో వ్యతిరేకతను చల్లార్చేందుకే అభ్యర్థుల ప్రకటన డ్రామా ఆడారని విమర్శించారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, తిరుపతిలో అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నిజస్వరూపం ఇప్పుడే తెలుస్తోందని ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. పవన్కు చంద్రబాబు ఇప్పుడు ట్రైలర్ మాత్రమే చూపించారని.. ఇంకా సినిమా చాలా ఉందని ఉషశ్రీ చరణ్ ఎద్దేవా చేశారు. పవన్ ఓటు బ్యాంక్ను వాడుకుని.. చంద్రబాబు సీఎం కావాలవని అనుకుంటున్నారని విమర్శించారు. షర్మిల కూడా చంద్రబాబు స్క్రిప్ట్నే చదువుతోందని విమర్శించారు.