Srilanka Cricket : ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో శ్రీలంక బోర్డు(Srilanka Cricket) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ మాజీ పేసర్ అకీబ్ జావేద్(Aaqib Javed)ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమించింది. టీ20 వరల్డ్ కప్ వరకూ జావేద్ను కోచ్గా కొనసాగించనుంది. ఈ విషయాన్నిశనివారం లంక క్రికెట్ ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
‘పాకిస్థాన్ పేసర్ అకీబ్ జావేద్ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా నియమిస్తున్నాం. అతడు ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ వరకూ పదవిలో ఉంటాడు’ అని లంక బోర్డు తెలిపింది. ఆటగాడిగా, కోచ్గా జావేద్కు ఉన్న అంతర్జాతీయ అనుభవం శ్రీలంక జట్టుకు ఎంతో పనికొస్తుందని సీఈఓ అష్లే డిసిల్వా అన్నాడు.
He will work with the national team until the completion of the ICC Men’s T20 World Cup, which is scheduled to be held in the West Indies and USA during June 2024.https://t.co/L3943akKUc#SLC #lka
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 16, 2024
మాజీ స్పీడ్స్టర్ అయిన జావేద్ 1992లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్థాన్ జట్టులో సభ్యుడు. ఆటకు వీడ్కోలు పలికన తర్వాత అతడు కోచ్గా అవతారమెత్తాడు. జావేద్ పాకిస్థాన్ బౌలింగ్ కోచ్గా ఉన్న 2009లోనే ఆ జట్టు టీ20 వరల్డ్ కప్ చాంపియన్గా అవతరించింది. అనంతరం అతడు పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు కోచ్గా సేవలందించాడు.
అకీబ్ జావేద్
అతడి శిక్షణలో రాటుదేలిన యూఏఈ జట్టు వన్డే, టీ20 స్టేటస్ దక్కించుకుంది. అంతేకాదు 2015 వరల్డ్ కప్లో ఆడింది. కోచ్గా సూపర్ ట్రాక్ రికార్డు ఉన్న జావేద్.. లంక క్రికెట్ను కొత్త పుంతలు తొక్కిస్తాడా? లేదా? చూడాలి. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో లాహోర్ క్యాలండర్స్ జట్టుకు హెడ్కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్గా జావేద్ పని చేస్తున్నాడు.