Ajay Pratap Singh : లోక్సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్లో భారతీయ జనతాపార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పోస్టు చేశారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మకు తన రాజీనామా లేఖలు పంపించాడు. మార్చి 2018లో బీజేపీ అజయ్ ప్రతాప్ సింగ్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. కాగా, ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.
BJP Rajya Sabha MP Ajay Pratap Singh resigns from the party. pic.twitter.com/W26tD0CA11
— ANI (@ANI) March 16, 2024