IPL | గువహటి: సుమారు రెండు నెలలుగా సాగుతున్న ఐపీఎల్-17లో ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది. గువహటి వేదికగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం రాజస్థాన్ రాయల్స్ను నిండా ముంచింది. ఆదివారం సాయంత్రం నుంచే వర్షంలో తడిసిముద్దయిన బర్సపుర స్టేడియంలో ఒక్క బంతి కూడా పడలేదు. రాత్రి 9:30 గంటల తర్వా త వాన కాస్త తెరిపినిచ్చినా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో గ్రౌండ్ సిబ్బంది దానిని ప్రిపేర్ చేసేసరికి పది దాటింది. రాత్రి 10:25 గంటలకు గ్రౌండ్ను పరిశీలించిన అంపైర్లు.. ఏడు ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని చూసి టాస్ వేసినా వరుణుడు ఆ అవకాశమివ్వలేదు.
సారథులిద్దరూ టాస్కు వచ్చి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లగానే మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఆఖరి లీగ్మ్యాచ్ను ఆస్వాదిద్దామనుకున్న ‘ఈశాన్య రాష్ర్టాల’ అభిమానులకు నిరాశే మిగిలింది. అంతేగాక ఈ ఫలితంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో హైదరాబాద్తో సమానంగా నిలిచినా నెట్ రన్ రేట్ విషయంలో రాయల్స్ (+0.273) కంటే సన్రైజర్స్ (+0.414) మెరుగ్గా ఉండటంతో కమిన్స్ సేన రెండో స్థానానికి దూసుకెళ్లింది.
గువహటి: కోల్కతా-రాజస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం పాయింట్ల పట్టికలో శాంసన్ సేన మూడో స్థానంలో నిలిచింది. దీంతో ప్లేఆఫ్స్లో ఆ జట్టు బెంగళూరుతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. పంజాబ్ను ఓడించిన హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడంతో కోల్కతాతో తొలి క్వాలిఫయర్ ఆడుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడినా ఫైనల్ చేరేందుకు ఎస్ఆర్హెచ్కు మరో అవకాశం ప్లేఆఫ్స్ షెడ్యూల్ పై విధంగా ఉంది.