బ్యాంకాక్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత బ్యాడ్మింటన్ స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గి సత్తాచాటారు. బ్యాంకాక్ వేదికగా ఆదివారం జరిగిన తుదిపోరులో సాత్విక్-చిరాగ్.. 21-15, 21-15 తేడాతో చైనా ద్వయం చెన్ బొయంగ్ – లియిని మట్టికరిపించారు.
46 నిమిషాల్లోనే ముగిసిన తుదిపోరులో ప్రపంచ మూడో ర్యాంకు జోడీ.. ఈ టోర్నీలో ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలవడం గమనార్హం. ఈ ఇద్దరికీ 2019 తర్వాత థాయ్లాండ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్లో 9వ టైటిల్. భారత షట్లర్లకు ఈ విజయంతో 9,200 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు రూ. 27.63 లక్షల నగదు బహుమానం దక్కింది.