IND vs ENG : లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత పేసర్లు హడలెత్తిస్తున్నారు. నాలుగో రోజు తొలి సెషన్లో బుల్లెట్ లాంటి బంతులతో బుమ్రా చెలరేగుతుండగా.. స్పీడ్స్టర్ సిరాజ్ భారత్కు బ్రేకిచ్చాడు. స్వీప్ షాట్తో బౌండరీ సాధించిన బెన్ డకెట్(12)ను ఔట్ చేశాడు. గ్రౌండ్ షాట్ ఆడబోయిన డకెట్ మిడాన్లో బుమ్రా చేతికి చిక్కాడు. అంతే.. 22 వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జాక్ క్రాలే (6), ఓలీ పోప్(0)లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ 22 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్నైట్ స్కోర్ 2-0తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లకు బుమ్రా, సిరాజ్ చుక్కలు చూపించారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ జాక్ క్రాలే(6), బెన్ డకెట్(12)లను ఇరుకున పెట్టారు. స్వీప్ షాట్తో బౌండరీ సాధించిన డకెట్ దూకుడు పెంచే క్రమంలోనే సిరాజ్ ఓవర్లో బుమ్రా చేతికి క్యాచ్ ఇచ్చాడు. దాంతో, 22 పరుగుల వద్ద ఇంగ్లండ్ మొదటి వికెట్ పడింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 371 రన్స్ చేయగా.. టీమిండియా కూడా అంతే స్కోర్కు పరిమితమైన విషయం తెలిసిందే.