Sachin Tendulkar | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం, ఎన్నికల ప్రచారకర్త సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సైతం ఓటు వేశారు. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar)తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు.
కాగా, ఎన్నికల ప్రక్రియలో ఓటరు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ను భారత ఎన్నికల సంఘం ‘ఎన్నికల ప్రచారకర్త’గా నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గతేడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. యువ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
#WATCH | Former Indian Cricketer Sachin Tendulkar says, “I am the national icon of ECI and I was involved in quite a few initiatives to raise awareness about the importance of casting your vote. Today as a proud indian I am able to do that. I am really really happy…I appeal all… https://t.co/xKJuo8igyp pic.twitter.com/dRkRlDGw63
— ANI (@ANI) May 20, 2024
Also Read..
PM Modi | బీజేడీ పాలనలో పూరీ జగన్నాథుడి ఆలయం సురక్షితంకాదు : ప్రధాని మోదీ
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో యువతి బెల్లీ డ్యాన్స్.. VIDEO
Rave Party | బెంగళూరులో రేవ్పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు