WTC 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ రేపటితో ముగియనుంది. మరో పది రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనుంది. దాంతో, ఈ మెగా టోర్నమెంట్పై అందరి కళ్లు నిలిచాయి. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇప్పటికే 17మందితో కూడిన బృందాన్ని ఎంపికచేశాయి. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) తన తుది జట్టును వెల్లడించాడు. అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్(David Warner)ను ఓపెనర్గా ఎంచుకున్నాడు. ఉస్మాన్ ఖవాజాకు జోడీగా వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించాలని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
మిడిలార్డర్లో మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ను ఆడించాలని పాంటింగ్ సూచించాడు. అలెక్సీ క్యారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్లను నలుగురు రెగ్యలర్ బౌలర్లుగా తుది జట్టులోకి తీసుకున్నాడు.
పాంటింగ్ తుది జట్టు : ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్సీ క్యారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
Which side will emerge as the #WTC23 champion? 🤔
More 👉 https://t.co/3jlMQpZ5np pic.twitter.com/b5KFBJoBUJ
— ICC (@ICC) May 22, 2023
ప్రధాన పేసర్ జోష్ హేజిల్వుడ్ ఫైనల్ వరకు పూర్తిగా కోలుకోకుంటే బోలాండ్ను ఆడించాలని పాంటింగ్ సలహా ఇచ్చాడు. గత ఏడాది కాలంగా బోలాండ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ పిచ్లపై అతను చెలరేగగలడు అని పాంటింగ్ తెలిపాడు. 28 ఏళ్ల బోలాండ్ 2021లో ఇంగ్లండ్పై టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలోనూ సత్తా చాటిన అతను ఇప్పటివరకు 28 వికెట్లు తీశాడు.
ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా టెస్టు గద కోసం ఈ రెండు జట్లు హోరాహోరీ పోరాడనున్నాయి. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఫైనల్ ఫైట్ జరగనుంది. ఐపీఎల్ రూపంలో భారత జట్టు కీలక ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ 16వ సీజన్లో సెంచరీలు బాది ఫామ్ చాటుకున్నారు. సీనియర్ పేసర్ షమీ, సిరాజ్ పదునైన బంతులతో బ్యాటర్లకు వణుకుపుట్టిస్తున్నారు. దాంతో, రోహిత్ శర్మ సేన టెస్టు గదను సొంతం చేసుకొనేందుకు ఈసారి మంచి అవకాశం ఉంది. 2021-22లో ఫైనల్ చేరిన టీమిండియా అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.