హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో(Jagityala district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీ కొనడంతో(Lorries collided)ఒకరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ బ్రిడ్జి పైనా ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాలు సరఫరా చేసే లారీ డ్రైవర్ దామెర రాజేందర్ రెడ్డి మృతి చెందాడు.
బ్రిడ్జి పైనా రెండు వాహనాలు పడి పోవడంతో కరీంనగర్- జగిత్యాల రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.