IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17వ సీజన్ మినీ వేలం ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు టోర్నీ సన్నద్ధతపై దృష్టి పెట్టాయి. ఐపీఎల్ టాప్ జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్(Punjab Kings) 2024 ఎడిషన్పై భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఆ జట్టు మొహాలీ(Mohali)తో పాటు మరో కొత్త స్టేడియంలో ఆడనుంది. ముల్లన్పూర్ (Mullanpur)లో కొత్తగా నిర్మిస్తున్న స్టేడియం దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ మధ్యే పంజాబ్ క్రికెట్ ఆసోసిషేన్ అధికారులు ఈ స్టేడియాన్ని సందర్శించి, ఫొటోలు షేర్ చేశారు.
‘పంబాజ్ క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ముల్లన్పూర్లో కొత్తగా నిర్మిస్తున్న స్టేడియం పనులు పూర్తి కావొచ్చాయి. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ సమయానికల్లా ఈ స్టేడియం సిద్ధమవుతుంది’ అని పీసీఏ సెక్రటరీ దిల్షేర్ ఖన్నా(Dilher Khanna) ఓ ప్రకటనలో తెలిపాడు.
🚨 Announcement 🚨
The wait is over ! PCA New Cricket Stadium will be ready soon for IPL 2024@dilsherkhanna pic.twitter.com/u6mMr4uLSR
— Punjab Cricket Association (@pcacricket) December 31, 2023
వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్న భారత్, అఫ్గనిస్థాన్ టీ20 మ్యాచ్కు ముల్లనూర్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందనే వార్తలు వినిపించాయి. అయితే.. ఈ సమయానికి స్టేడియం పనులు పూర్తి కావని, ఐపీఎల్ 17వ సీజన్ వరకు సిద్ధమవుతుందని పీఏసీ అధికారులు తెలపారు. ముల్లనూర్ స్టేడియంలో 12 పిచ్లు ఏర్పాటు చేశారు. ఆటగాళ్ల కోసం రెండు పెద్ద డ్రెస్సింగ్ రూమ్లు నిర్మించారు. మొత్తంగా ఇందులో 30 వేల మంది మ్యాచ్ వీక్షించొచ్చు. దాదాపు 1,800 కార్లు పార్కింగ్ చేసే వీలుంది.
ఐపీఎల్ తొలినాళ్లలో గట్టి పోటీనిచ్చిన పంజాబ్ కింగ్స్ ఆతర్వాత తేలిపోయింది. యువరాజ్ సింగ్(Yuvraj Singh), కుమార సంగక్కర, వీరేంద్ర సెహ్వాగ్లు కెప్టెన్గా, జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉన్నా కూడా ఆ జట్టు టైటిల్ గెలవలేకపోయింది. 16వ సీజన్లో శిఖర్ ధావన్(Shikhar Dhawan) నేతృత్వంలో పంజాబ్ విజయంతో ఆరంభించినా అనంతరం పేలవ ఆటతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. మినీ వేలంలో రూ.18.50 కోట్లు పలికిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్(Sam Curran) తీరా టోర్నీలో నిరాశపరిచాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్లోనూ జట్టును గెలిపించలేకపోయాడు.