KTR | హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. వారితో కాసేపు ముచ్చటించిన కేటీఆర్.. అనంతరం కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇక కేటీఆర్ను పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Started the first day of 2024 by thanking the hardworking sanitation workers of the GHMC
Had a good lunch meeting with a few hundred of my erstwhile team members along with Mayor GHMC pic.twitter.com/YPpsxXUPcc
— KTR (@KTRBRS) January 1, 2024