ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్లో ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. చివరి బెర్తు కోసం ఉత్కంఠ నెలకొంది. నాలుగో స్థానం కోసం 2019 రన్నరప్ న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య పోటీ నెలకొంది. అయితే.. దాయాది పాక్ కంటే కివీస్కే ఎక్కువ చాన్స్లు ఉన్నాయి. ఎందుకంటే..? చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకను భారీ తేడాతో ఓడించిన కివీస్ నెట్ రన్రేటు (+0.743) పరంగా పాక్ కంటే (+0.036) ఎంతో మెరుగ్గా ఉంది. దాంతో, బాబర్ సేనకు సెమీస్ తలుపులు దాదాపు మూసుకుపోయినట్టే. అయితే… ఆఖరి మ్యాచ్లో పాకిస్థాన్ ఇంగ్లండ్పై అద్బుతం చేస్తే సెమీస్ రేసులో నిలిచే అవకాశం ఉంది.
నవంబర్ 11న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో పాక్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సెమీస్ రేసులో న్యూజిలాండ్ను వెనక్కి నెట్టాలంటే ఈ మ్యాచ్లో పాకిస్థాన్.. మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే.. 284 బంతులు అంటే 47 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ముగించాలి. బాబర్ సేన 300 రన్స్ కొడితే బట్లర్ బృందాన్ని 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. ఒకవేళ 400 కొడితే.. ఇంగ్లండ్ను 112 రన్స్కే పరిమితం చేయాలి.
Qualification scenario for Pakistan:
Score 300, restrict England to 13.
Score 400, restrict England to 112.
Score 450, restrict England to 162.
Score 500, restrict England at 211. pic.twitter.com/dv6GFKbyf0
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 9, 2023
450 పరుగులు బాదితే.. ఇంగ్లీష్ జట్టును 162 రన్స్ లోపు కట్టడి చేయాలి. ఏ రకంగా చూసినా పాక్.. ఇంగ్లండ్ను తక్కువకే కట్టడి చేయడం దాదాపు అసాధ్యమే. అదీకాకుండా మ్యాచ్ రద్దయినుకోండి.. పాక్, ఇంగ్లండ్ జట్లకు చెరొక పాయింట్ వస్తుంది. అప్పుడు 9 పాయింట్లతో పాక్ ఐదో స్థానంలో నిలుస్తుంది. కానీ, నెదర్లాండ్స్పై 160 పరుగుల తేడాతో గెలిచిన బట్లర్ సేన విజయంతో టోర్నీని ముగించాలనే కసితో ఉంది. ఈ మ్యాచ్లో పాక్ ఓడితే కివీస్ నాలుగో స్థానంతో సెమీస్కు దూసుకెళ్తుంది.
తొలి సెమీఫైనల్ నవంబర్ 15న జరుగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, న్యూజిలాండ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి 2019 సెమీస్ పరాజయానికి బ్లాక్క్యాప్స్పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.