స్నేహితుల దినోత్సవం రోజున స్నేహానికి అసలైన నిర్వచనం ఇచ్చారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తారు. ‘AA23’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో తన ప్రాణ స్నేహితుల్ని భాగస్వాముల్ని చేశారు బన్నీ. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అల్లు అర్జున్ అనుంగు మిత్రుడైన బన్నీ వాస్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
అలాగే బన్నీ ప్రాణమిత్రులైన సందీప్ రామినేని, నటరాజ్, స్వాతి కూడా ఈ సినిమాలో భాగస్తులు కానున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం, కలిసి ఆనందాల్ని పంచుకోవడం కాదు, తనతో పాటు తన స్నేహితులు కూడా గొప్పగా రాణించాలని కోరుకోవడం. ఈ విషయాన్ని బలంగా నమ్మే వ్యక్తుల్లో అల్లు అర్జున్ ఒకరు. కష్టసుఖాల్లో తనతో నడిచిన స్నేహితుల్ని తనతోపాటే ముందుకు తీసుకెళ్తూ.. బన్నీ నిజమైన హీరో అనిపించుకున్నారంటూ ఈ విషయంపై అంతా హర్షం వెలిబుచ్చుతున్నారు.