నల్లబెల్లి, ఆగస్టు 2 : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అకాల మరణాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని విలపిస్తున్నారు. ఆదివారం నల్లబెల్లి మండలకేంద్రానికి పెద్ద సంఖ్యలో చేరుకొని పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వనంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పెద్ది చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం పెద్ది సతీమణి స్వప్పతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే స్థానిక మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ప్యాక్స్ మాజీ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్, నాయకులు ఊడుగుల ప్రవీణ్, పాలెపు రాజేశ్వర్రావు, సర్పంచులు జాటోత్ చిన్నరాథోడ్, అర్రెం సాంబయ్య, గందె శ్రీనివాస్గుపా, దేవ్సింగ్, అఖిల్, తిరుపతి, గూబ రాజు, శివాజీ, బొమ్మిడి శివారెడ్డి, నెక్కొండ మండల సీనియర్ నాయకుడు, న్యాయవాది కొమ్ము రమేశ్యాదవ్, నాయకులు తాటిపెల్లి శివకుమార్, ఈదునూరి వెంకన్న, కారింగుల సురేశ్, దేవరబోయిన వీరబద్రం, పొడిశెట్టి సత్యం, మాతంగి రాజు, బండారు మురళీకృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.