NZ vs PAK : పాకిస్థాన్ మహిళల జట్టు టీ20ల్లో చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. నిదా డార్(Nida Dar) నేతృత్వంలోని పాక్ న్యూజిలాండ్(Newzealand) గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచింది. ఫాతిమా సనా, అలియా రియాజ్ పోరాటంతో రెండో టీ20లో పాక్ అద్భుత విజయం సాధించింది. దాంతో, కివీస్ గడ్డపై తొలి టీ20 సిరీస్ విజేతగా అవతరించింది. 2018 డిసెంబర్ తర్వాత పాక్ మహిళల జట్టు ఆసియాలో కాకుండా ఇతర దేశాల్లో పొట్టి సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో పాక్ తొలి మ్యాచ్లో గెలుపొందింది. మంగళవారం యూనివర్సిటీ ఓవల్(University Oval) స్టేడియంలో జరిగిన రెండో టీ20లోనూ నిదా డార్ బృందం అదరగొట్టింది. ఓపెనర్ మునీబా అలీ(35), అలియా రియాజ్(32) రాణించడంతో పాక్ 137 పరుగులు చేసింది.
A first T20I series win away from home since 2018!
More on Pakistan’s momentous victory over New Zealand in Dunedin 👇#NZvPAKhttps://t.co/xWzsYqF35E
— ICC (@ICC) December 5, 2023
భారీ ఛేదనలో కివీస్ ఆది నుంచి తడబడింది. పాక్ పేసర్ ఫాతిమా సనా మూడు వికెట్లతో న్యూజిలాండ్ను దెబ్బకొట్టింది. సాదిక్ ఇక్బాల్ కూడా రెండు వికెట్లు పడగొట్టడంతో కివీస్ 127 పరుగులకే పరిమితమైంది. దాంతో, పాక్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.