ICC Champions Trophy 2025: పాకిస్తాన్ వేదికగా 2025లో జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆ దేశంలో జరిగేది అనుమానంగానే ఉంది. భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. భారత్తో పాటు మరికొన్ని జట్లు కూడా ఇదే కారణాన్ని చూపుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ రైట్స్ను రద్దు చేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ట్రోఫీని దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్టు సమాచారం.
ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో భాగంగా భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లకపోవడంతో టీమిండియా ఆడే మ్యాచ్లను శ్రీలంకకు తరలించిన విషయం తెలిసిందే. ఆసియా కప్ ముగిసిన వెంటనే మొదలైన వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ కూడా అదే స్ట్రాటజీని అమలుచేయాలని పట్టుబట్టినా అందులో విఫలమైంది. ఐసీసీ ఒప్పించడంతో భారత్లో వన్డే ప్రపంచకప్ ఆడింది. వన్డే ప్రపంచకప్కు ముందు జరిపిన చర్చలలో భాగంగా భారత జట్టు 2025లో తమ దేశానికి వస్తానని హామీ ఇస్తేనే విశ్వ కప్ ఆడేందుకు తాము వస్తామని కండీషన్ పెట్టిందని వార్తలు వచ్చాయి.
🚨Breaking🚨
ICC Likely To Snatch Champions Trophy Rights From Pakistan. ( Via Abishek Tripathi)
Pakistan will not be hosting the ICC Champions Trophy in 2025. ( Via Abishek Tripathi)
Dubai will host Champions Trophy matches or a hybrid model will be implemented if the Indian… pic.twitter.com/iJdMKotDzO
— Latest & Update (@latestandupdate) November 27, 2023
తాజాగా అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఐసీసీ మీటింగ్లో జకా అష్రఫ్ ఇదే విషయాన్ని లేవనెత్తినట్టు సమాచారం. ఒకవేళ భారత్ గనక ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్కు రాకుంటే తమకు నష్టపరిహారం ఇవ్వాలని ఐసీసీకి విన్నవించాడు. అయితే తాజా సమాచారం మాత్రం ఏకంగా ఆ దేశం మరోసారి ఐసీసీ ఆతిథ్య హక్కులు కోల్పోనుందని వార్తలు వస్తుండటంతో పాకిస్తాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.