నేడు మల్లయోధుల ధర్నా స్థలికి ఢీల్లీ సీఎం కేజ్రీవాల్
Bajrang Punia | లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ (WFI president ), బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు (Wrestlers) ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద చేస్తున్న ధర్నా కొనసాగుతోంది. బ్రిజ్ భూషణ్ తమను వేధించాడని రోడ్డెక్కిన రెజ్లర్లు.. అతడిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు విశ్రమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం రోడ్డెక్కిన మల్లయోధుల పట్ల ఢిల్లీ పోలీసు (Delhi Police)ల తీరుపై టాప్ రెజ్లర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నిరసన తెలిపిన రెజ్లర్లకు ఆహారం (food), నీరు (water ) ఇవ్వకుండా ఢిల్లీ పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఒలింపిక్ పతక విజేత (Olympic medallist) బజరంగ్ పునియా (Bajrang Punia) ఆరోపించారు. ‘జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన ప్రదేశంలో విద్యుత్ నిలిపివేశారు. మా వద్దకు ఆహారం, నీరు కూడా అనుమతించకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సుప్రీం కోర్టు నోటీసుల తర్వాత పోలీసులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. నిరసన ప్రదేశంలోకి సామగ్రిని తెచ్చేందుకు కేటాయించిన వ్యక్తులను పోలీసులు కొట్టారు. పోలీసులు మమ్మల్ని ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా.. మా పోరాటం ఆగదు. న్యాయం జరిగేవరకూ నిరసనలు కొనసాగిస్తాం’ అని పునియా స్పష్టం చేశారు.
మరోవైపు, జంతర్ మంతర్ వద్ద పోలీసులు విద్యుత్, రేషన్ సరఫరాను నిలిపివేశారనే ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ ప్యానెల్ చీఫ్ (Delhi Commission for Women panel chief ) స్వాతి మలివాల్ (Swati Maliwal) స్పందించారు. ‘మొదటి ఆరు రోజులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఆ తర్వాత నిరసన ప్రదేశంలో విద్యుత్ నిలిపివేశారు. ఆహారం, నీటిని అనుమతించలేదు. బహుశా అత్యంత అణచివేత రాజు కూడా తన ప్రత్యర్థి పట్ల ఇలా ప్రవర్తించి ఉండకపోవచ్చు’ అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు న్యాయం కోసం రోడ్డెక్కిన రెజ్లర్ల (Wrestlers) కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, రైతు సంఘాల నేతలు, పలువురు క్రీడాకారులు మల్లయోధుల ఆందోళనకు మద్దతు లెలిపారు. వారికి న్యాయం జరగాలని కోరుతూ కొందరు సోషల్ మీడియా ద్వారా పోస్టులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా రెజ్లర్ల ఆందోళనకు మద్దతు తెలపనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశాన్ని ఆయన సందర్శించి మల్లమోధులతో మాట్లాడనున్నారు. కేజ్రీవాల్తోపాటు ఆప్ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషితోపాటు పలువురు నేతలు రెజ్లర్లకు సంఘీభావం తెలపనున్నారు.
We had ordered some goods but they (police) are not allowing us to bring them here and they are making the person who brought the goods run away by beating them. Until justice is served, we will protest no matter how much the police administration tortures us: Wrestler Bajrang…
— ANI (@ANI) April 29, 2023
पहले 6 दिन तक FIR ना करो, उसके बाद आंदोलनकारियों की बिजली, दाना-पानी रोक दो। ऐसा तो शायद ज़ालिम से ज़ालिम बादशाह भी अपने विरोधी के साथ नहीं करते थे, ये तो फिर भी लोकतंत्र है, ये तो फिर भी Olympics Champion हैं। pic.twitter.com/Z7yt3x2Q17
— Swati Maliwal (@SwatiJaiHind) April 29, 2023
Also Read..
Priyanka Gandhi | రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించిన ప్రియాంక గాంధీ
Adipurush | ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్.. సీతగా ఆకట్టుకుంటున్న కృతిసనన్