Gold Smuggling | బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India)కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న (Gold Smuggling) ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (Border Security Force ) అరెస్ట్ చేసింది. పశ్చిమబెంగాల్ (West Bengal)లోని 24 పరగణాల జిల్లా (24 Parganas district)లో ఆమెను అరెస్ట్ చేశారు. మహిళ నుంచి 27 బంగారు కడ్డీల (27 gold bars)ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంగ్లాదేశ్లోని చిట్టిగాంగ్ (Chittagong)కు చెందిన ఓ మహిళ బంగారంతో సరిహద్దు దాటినట్లు బీఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే మహిళా సిబ్బంది చెక్పోస్ట్ వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టగా.. బంగ్లాదేశ్కు చెందిన 34 ఏండ్ల మనికా దర్ (Manika Dhar) వద్ద బంగారు కడ్డీలు కనిపించాయి. దుస్తుల్లో సుమారు 2 కిలోల బంగారాన్ని అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు స్మగ్లర్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బెంగాల్ (West Bengal)లోని బరాసత్ ప్రాంతంలో ఉంటున్న ఓ గుర్తుతెలియని వ్యక్తికి ఈ బంగారం అందించాలని తనకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. ఈ పని చేస్తే రూ.2వేలు ఇస్తానని సదరు వ్యక్తి చెప్పాడని.. మొదటిసారి ఈ పనిలోకి దిగినట్లు విచారణలో మహిళ వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బంగారు కడ్డీల బరువు 2 కిలోల కంటే ఎక్కువ ఉంటుందని పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.1.29 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
Also Read..
India Corona | దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 40 మరణాలు
Adipurush | ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్.. సీతగా ఆకట్టుకుంటున్న కృతిసనన్