India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 7 వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్మాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry Of India) వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,94,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 7,171 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
గత 24 గంటల వ్యవధిలో 9,669 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,43,56,693కి చేరింది. మహమ్మారి కారణంగా కేరళలో 15 మంది, ఢిల్లీలో ఆరు మంది, ఉత్తర్ప్రదేశ్లో నలుగురు, ఛత్తీస్గఢ్లో ముగ్గురు, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఇద్దరు చొప్పున, మేఘాలయా, జమ్మూ అండ్ కశ్మీర్, పంజాబ్, చండీగఢ్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 53,1508కు ఎగబాకింది.
ఇక ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.11 శాతం యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read..
Night Vision Goggles: నైట్ విజన్ గగుల్స్తో సుడాన్లో డేరింగ్ ఆపరేషన్
Secretariat | కొత్త సచివాలయంలో నీళ్ల మీదనే తొలి సమీక్ష