Secretariat | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): మొదటినుంచి సాగునీటికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేకతను మరోసారి చాటుకుంటున్నది. కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తొలి సమీక్ష సమావేశం సాగునీటి రంగంపైనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ, సీతమ్మసాగర్ బహుళార్ధక సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఈ సమీక్ష జరుగనున్నది.
ఈ నెల 30న సచివాలయం ప్రారంభోత్సవం అనంతరం సాయంత్రం 4 గంటలకు రెండో అంతస్థులోని ఏ వింగ్ మీటింగ్ హాల్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతోపాటు, రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఆయా జిల్లాలకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు పాల్గొననున్నారు.