న్యూఢిల్లీ: సుడాన్లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించేందుకు ఆపరేషన్ కావేరి చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే అత్యంత డేరింగ్గా ఆ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎయిర్ఫోర్స్ పైలెట్లు నైట్ విజన్ గగుల్స్తో సుడాన్లో ఓ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సీ-130జే హెరిక్యూల్స్ విమానానికి చెందిన పైలెట్లు ఆ డేరింగ్ స్టంట్ చేపట్టారు. కటిక చీకట్లో నైట్ విజన్ గగుల్స్(Night Vision Goggles) పెట్టుకుని అతి చిన్న రన్వేపై విమానాన్ని మన పైలెట్లు దింపారు. రాజధాని ఖర్తూమ్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాది సయ్యిద్నా ఎయిర్పోర్టులో పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేశారు.
రన్వే క్లియర్ ఉందని తెలిసిన తర్వాత ఆ విమాన పైలెట్లు ఆపరేషన్ కొనసాగించారు. ల్యాండ్ అయిన తర్వాత విమాన ఇంజిన్లను ఆన్లోనే ఉంచారు. ఎయిర్ఫోర్స్ స్పెషల్ యూనిట్లకు చెందిన 8 మంది గరుడ కమాండోలు ప్రయాణికుల్ని సురక్షితంగా విమానం ఎక్కించారు. చాలా చీకటిగా ఉన్న ఆ ఎయిర్స్ట్రిప్పై.. నైట్ విజన్ గగుల్స్తోనే టేకాఫ్ చేపట్టారు. రెండున్నర గంటల పాటు ఆ ఆపరేషన్ కొనసాగింది.
సీ-130 జే విమానానికి గ్రూపు కెప్టెన్గా రవి నంద ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా 2021 ఆగస్టులో ఆపరేషన్ దేవి శక్తి చేపట్టినప్పుడు కెప్టెన్ రవి ఇలాంటి డేరింగ్ స్టంట్ చేపట్టారు. ఆ సాహసోపత ఆపరేషన్ చేపట్టిన ఆయన్ను గ్యాలెంటరీ అవార్డుతో సత్కరించారు.
Group Captain Ravi Nanda is the captain of the Indian Air Force C-130J Special Ops aircraft which carried out the daring operation to rescue 121 Indian nationals from a small airstrip in Wadi Sayidna near Khartoum, Sudan during the ongoing conflict there. Nanda was awarded a… pic.twitter.com/SJaRDMLZyN
— ANI (@ANI) April 29, 2023