Adipurush | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) శ్రీరాముడి పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ నటి కృతిసనన్ (Kriti Sanon) కీలక పాత్ర పోషిస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ను షురూ చేసింది. కొత్త పోస్టర్లు, టీజర్లతో సినిమాపై అంచానాలను పెంచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా, అభిమానులకు చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. కృతిసనన్ సీత పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్లను విడుదల చేసింది. దీంతోపాటు ‘జై సియా రామ్’ ఆడియో టీజర్ను కూడా విడుదల చేసింది. కొత్త పోస్టర్లలో సీతమ్మగా కృతి సనన్ ఆకట్టుకునేలా కనిపించింది. తాజాగా విడుదలైన పోస్టర్లు, ఆడియో టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
కాగా, ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ఆదిపురుష్’ చిత్రం వాయిదా పడి ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read..
India Corona | దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 40 మరణాలు
Night Vision Goggles: నైట్ విజన్ గగుల్స్తో సుడాన్లో డేరింగ్ ఆపరేషన్