కొవిడ్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
విద్యానగర్/నాగిరెడ్డిపేట్/పిట్లం/ సదాశివనగర్, మే 4 : కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ, శానిటేషన్ పనులు కొనసాగుతున్నాయి. కామారెడ్డి పట్టణంలోని జన సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, పాత బస్టాండ్, మార్కెట్లు, పలుకాలనీల్లో మున్సిపల్ కార్మికులు ట్యాంకర్తో మంగళవారం సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కొవిడ్ బాధితుల ఇండ్ల పరిసరాల్లోనూ స్ప్రే చేశారు. పలు కాలనీల్లో మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ను చల్లారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాసు, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ పర్వేజ్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్, నాగిరెడ్డిపేట్ గ్రామాల్లో మంగళవారం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలతోపాటు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్, కో-ఆపరేటివ్ బ్యాంకు ఆవరణలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు.
పిట్లం గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో సర్పంచ్ విజయలక్ష్మి మంగళవారం పారిశుద్ధ్య కార్మికులతో బుడగజంగం కాలనీ, హరిజనవాడలో శానిటేషన్ పనులు చేయించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.సదాశివనగర్ మండలంలోని భూంపల్లిలో హైపోక్లోరైట్ ద్రావణ పిచికారీని ఎంపీపీ గైని అనసూయ రమేశ్, సర్పంచ్ శంభు లలితాబాయి ప్రారంభించారు. కరోనా కట్టడికి మండలంలోని అన్ని గ్రామాల్లో వారం రోజులపాటు స్వచ్ఛంద లాక్డౌన్ విధించామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పశుల సాయిలు, వార్డుసభ్యులు రమేశ్, జీపీ, రెవెన్యూ సిబ్బంది సంజీవ్, గైని లక్ష్మణ్ పాల్గొన్నారు.