Hardhik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) మరో టైటిల్పై కన్నేసింది. 16వ సీజన్లో ప్లే ఆఫ్స్లో వెనుదిరిగిన ముంబై 17వ సీజన్లో ట్రోఫీని కొల్లగొట్టాలనే కసితో ఉంది. అందుకని 17వ సీజన్ వేలానికి ముందే కొత్త కెప్టెన్ను నియమించి సంచలనం సృష్టించింది. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ(Rohit Sharma)ను తప్పించి.. హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు పగ్గాలు అప్పగించింది.
వేలానికి కొద్ది రోజుల ముందే ట్రేడింగ్ పద్ధతిలో గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను ముంబై కొనుగోలు చేసింది. అయితే.. ఈ ఆల్రౌండర్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా రూ.100 కోట్లు గుజరాత్కు ఇచ్చిందని సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పాండ్యా రికార్డు సృష్టిస్తాడు.
ఐపీఎల్లో పాండ్యాకు మంచి రికార్డు ఉంది. టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడి సొంతం. తొలి రోజుల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన పాండ్యా.. 2022లో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ స్టార్ ఆల్రౌండర్ తన మార్క్ సారథ్యంతో గుజరాత్ను అరంగేట్రంలోనే చాంపియన్గా నిలిపాడు. అంతేకాదు రెండో సీజన్లోనూ జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే.. ధోనీ(MS Dhoni) నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో గుజరాత్కు షాకిచ్చి టైటిల్ ఎగరేసుకుపోయింది.
వరల్డ్ కప్లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డ పాండ్యా
భారత జట్టు టీ20 సారథిగా రాణిస్తున్న పాండ్యా వరల్డ్ కప్(ODI World Cup 2023)లో గాయపడిన విషయం తెలిసిందే. లీగ్ దశలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ బంతిని అడ్డుకోబోయిన అతడి ఎడమ కాలు మడత పడింది. నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడిన పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న పాండ్యా వచ్చే ఏడాది మైదానంలోకి దిగే చాన్స్ ఉంది. ఐపీఎల్ 17వ సీజన్కు ముందు అఫ్గనిస్థాన్తో సిరీస్లో పాండ్యా బరిలోకి దిగే అవకాశం ఉంది.