Team India : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు రేపటితో తెరలేవనుంది. సఫారీ గడ్డపై అందని ద్రాక్షలా ఊరిస్తున్నటెస్టు సిరీస్ను ఒడిసిపట్టేందుకు భారత జట్టు(Team India) నెట్స్లో చెమటోడ్చుతోంది. సెంచూరియన్లో బాక్సింగ్ డే(Boxing Day) టెస్టుకు ముందు రిలాక్స్గా గడిపేందేకు టీమిండియా వైల్డ్లైఫ్ సఫారీ(Wild Life Safari)కి వెళ్లింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు జట్టు సభ్యులు, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ వన్యప్రాణుల రైడ్లో సందడి చేశారు.
యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(Shubman Gill) అయితే ఏకంగా సింహంతో సెల్ఫీ దిగాడు. అనంతరం ద్రవిడ్, మరికొందరు భారీ ఖడ్గమృగం(Rhino)తో ఫొటో దిగి మురిసిపోయారు. సఫారీ టూర్ ఫొటోలను గిల్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ‘ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లతో కలిసి వన్యప్రాణుల్ని వీక్షించడం గొప్ప ఫీలింగ్. ఈ అద్భుత క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
భారత్, సఫారీల మధ్య సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న తొలి టెస్టు జరుగనుంది. అనంతరం జవనరి 3న కేప్టౌన్లో రెండో టెస్టు షురూ కానుంది. కుడి చేతివేలి గాయం కారణంగా టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) స్థానంలో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Eshwaran)ను సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
భారత టెస్టు స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వీ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, శార్థూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ, కేఎస్ భరత్(వికెట్ కీపర్).