MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి (Chennai Super Kings captain) ఎంఎస్ ధోనీ (MS Dhoni) రాంచీ (Ranchi)లోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించాడు. అభిమానుల మధ్య క్యూ లైన్లో నిల్చొని మరీ.. అమ్మవారిని దర్శించుకున్నాడు. దేవరీ మా ఆలయం (Deori Maa Temple)లోని దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశాడు. దర్శనానంతరం అర్చకులు ధోనీని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ధోనీని చూసిన అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ధోనీ.. దేవరీ మా ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
MS Dhoni visit at the Deori Maa Temple in Ranchi to seek blessings.
– This is beautiful..!!! pic.twitter.com/KYxRc3KXgU
— CricketMAN2 (@ImTanujSingh) February 6, 2024
కాగా, దేవరీ ఆలయాన్ని ధోనీ దర్శించడం ఇదేమీ మొదటిసారి కాదు. ప్రత్యేక సందర్భాలు, కీలక టోర్నీలు, ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మహీ ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటాడు. ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గాదేవి ఆశీస్సులు తీసుకుంటుంటాడు. ఏళ్లుగా ధోనీ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమీపిస్తుండటంతో ధోనీ మరోసారి ఆలయాన్ని సందర్శించి దుర్గామాత ఆశీస్సులు తీసుకున్నాడు.
ఐపీఎల్ 2024 వచ్చే నెలలో ఆరంభం కానున్న విషయం తెలిసిందే. మే 29 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచ్లు ఆడనున్నాయి. ఇక ఆటగాళ్ల వేలం ప్రక్రియ కూడా ఇటీవలే పూర్తైంది. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షణలో ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఇక చెన్నైకి ఐదుసార్లు కప్పు అందించిన ఈ మిస్టర్ కూల్.. జట్టును ఆరోసారి కూడా విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు.
Also Read..
Red Sea | ఎర్రసముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై హౌతీ రెబల్స్ దాడి
Visa Free Entry | భారతీయ పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించిన ఇరాన్.. షరతులు వర్తిస్తాయి..!
Sebastian Pinera | హెలికాప్టర్ ప్రమాదంలో చిలీ మాజీ అధ్యక్షుడు దుర్మరణం