క్రికెట్ వైరాల్లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం మామూలుది కాదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే చాలు.. వ్యూయర్షిప్ రికార్డులన్నీ బద్దలైపోతాయి. అలాంటి మ్యాచ్ ప్రపంచకప్లో భాగంగా జరుగుతుంటే ఆ మజానే వేరు. ఈ నెల 23వ తేదీన టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఆన్లైన్లో విడుదల చేసిన టికెట్లు ఇప్పటికే అయిపోయాయి కూడా.
ఈ క్రమంలోనే భారత్, పాక్ మ్యాచ్ కోసం ఎంసీజీ స్టేడియం ముస్తాబవుతోంది. కొన్నిరోజుల క్రితమే ఇక్కడ ఆస్ట్రేలియా ఫుట్బాల్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం గ్రౌండ్ను తయారు చేస్తున్న వీడియోను ఎంసీజీ విడుదల చేసింది. మొత్తం 1,00,024 మంది కూర్చునే వీలున్న ఈ స్టేడియంలో 80,000 టికెట్లను ఆన్లైన్లో అమ్మేశారు. మరికొన్ని రోజుల్లో మిగతా వాటిని కూడా సేల్లో ఉంచుతారని సమాచారం.
Just nine days ago, the 'G hosted its last footy match for the year.
Now, it's ready for summer. 🏏 pic.twitter.com/aWjnrqW3lH
— Melbourne Cricket Ground (@MCG) October 4, 2022