SRH vs PBKS | ఐపీఎల్ 17వ సీజన్ గ్రూప్ స్టేజీలో సన్రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) చివరి మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ ఓపెనర్లు(Punjab Openers ) నిలకడగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి అథర్వ థైడే (20) ప్రభ్సిమ్రన్ (15) పరుగులతో క్రీజులో ఉన్నారు. పంజాబ్ స్కోరు 35/0 (4ఓవర్లు) ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ మూడో స్థానంలో కొనసాగుతున్నది.