SRH vs PBKS : పదిహేడో సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్ సింగ్(69) అర్ధ సెంచరీ బాదగా.. రీలే రసువో(49), అథర్వ తైడే(46) విధ్వంసం సృష్టించారు. ఆఖర్లో కెప్టెన్ జితేశ్ శర్మ(32 నాటౌట్) మెరుపు బ్యాటింగ్తో జట్టు స్కోర్ రెండొందలు దాటించాడు. దాంతో, పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది.
పరుగుల వరద పారే పిచ్పై టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ జితేశ్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. అతడి నిర్ణయానికి న్యాయం చేస్తూ.. ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్(69), అథర్వ తైడే(46)లు వీరవిహారం చేశారు. భువనేశ్వర్, కమిన్స్, నటరాజన్లతో కూడిన పేస్ త్రయాన్ని ఉతికేస్తూ స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరి బాదుడుతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ పడకుండా 61 రన్స్ కొట్టింది.
Right wicket at the right time 😎
Prabhsimran’s solid knock comes to an end courtesy of a Klaasy catch 💪
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/a87LCfvi9g
— IndianPremierLeague (@IPL) May 19, 2024
అయితే.. ఈ జోడీని 97 వద్ద నటరాజన్ విడదీయడంతో హైదరాబాద్ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ కాసేపటికే ప్రభ్సిమ్రాన్ స్పిన్నర్ వియస్కాంత్ ఓవర్లో భారీ సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం రీలే రసువో(49) బౌండరీలతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే.. స్వల్వ వ్యవధిలో ప్రభ్సిమ్రాన్, రసువో, శశాంక్ సింగ్(2), అశుతోష్ శర్మ(2)లు ఔట్ కావడంతో పంజాబ్ స్కోర్ నెమ్మదించింది. కానీ, నితీశ్ వేసిన 20వ ఓవర్లో జితేశ్ శర్మ(32 నాటౌట్) బౌండరీతో పంజాబ్ స్కోర్ రెండొందలు దాటించాడు.
Innings Break!#PBKS have set a 🎯 of 2️⃣1️⃣5️⃣ , courtesy of an impressive batting display ❤️
Can #SRH chase it to strengthen their TOP 2️⃣ position? 🤔
Scorecard ▶️ https://t.co/K5rcY5Z8FS#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/05D8UFDnde
— IndianPremierLeague (@IPL) May 19, 2024
;