KS Bharat : భారత జట్టు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్(KS Bharat) శ్రీరాముడిపై తన భక్తిని చాటుకున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్ లయన్స్(England Lions)తో జరిగిన మ్యాచ్లో అజేయ శతకంతో మెరిసిన భరత్.. ఆ సెంచరీని అయోధ్య రాముడికి అంకితం చేశాడు.
సెంచరీ కొట్టాక ఈ తెలుగు కుర్రాడు వినూత్యంగా సంబురాలు చేసుకున్నాడు. శ్రీరాముడిలా విల్లు ఎక్కుపెట్టి, బాణం వదిలినట్టు అభినయించి కెమెరా కంట పడ్డాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో జనవరి 22న బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ (Pran Pratishta) జరుగనుంది. రెండు రోజుల క్రితమే 51 అడుగుల ఎత్తైన రామ్ లల్లా నల్ల రాతి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రవేశ పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు.
KS Bharat dedicated his hundred against England Lions to “Lord Ram”.
– Bharat did bow & arrow celebration…!!!!pic.twitter.com/B13stcQBu7
— Johns. (@CricCrazyJohns) January 21, 2024
ఇంగ్లండ్ సిరీస్కు సన్నాహకాల్లో భాగంగా భరత్.. భారత ఏ జట్టు తరఫున మూడు మ్యాచ్ల సిరీస్ ఆడుతున్నాడు. రెండో మ్యాచ్లో భరత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్లో 165 బంతుల్లో 116 పరుగులు చేసి జట్టును ఓటమి నుంచి బయటపడేశాడు. భరత్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత ఏ జట్టు మ్యాచ్ను డ్రా చేసుకుంది.
ఈ సెంచరీతో భరత్ తన ఎంపిక సరైనదే అని చాటాడు. అయితే.. ఇంగ్లండ్తో ఉప్పల్ వేదికగా జనవరి 25న మొదలయ్యే తొలి టెస్టులో అతడికి వికెట్ కీపర్గా చాన్స్ వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. రెండు టెస్టులకు భరత్తో పాటు కేఎల్ రాహుల్(KL Rahul), ధ్రువ్ జురెల్(Dhruv Jurel)లను వికెట్ కీపర్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ ముగ్గురిలో బెంచ్పై ఉండేది ఎవరు? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.