Suhaib Yaseen: క్రికెటర్గా రాణించాలని ఎన్నో కలలుగన్న ఓ యువ పేసర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటు(Heart attack)తో ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన అతడి పేరు సుహైబ్ యాసిన్(Suhaib Yaseen). క్రికెట్ ఆడుతుండగా మైదానంలోనే 20 ఏండ్ల యాసిన్కు గుండెపోటు వచ్చింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు.
తోటి ఆటగాళ్లు యాసిన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. శుక్రవారం హంజీవర ప్రాంతంలోని బారాముల్లా(Baramulla)లో ఉన్న పట్టాన్(Pattan)లో సుహైబ్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు.
In the wake of tragedy, Pattan grieves the loss of Suhaib Yaseen, a spirited soul who met an untimely end on the cricket field today. The pain is shared by the entire people of Pattan. My thoughts are with Suhaib’s family as they navigate this profound sorrow. May we collectively…
— Imran Reza Ansari (@imranrezaansari) January 26, 2024
అయితే.. రనప్ పూర్తి చేసి బంతిని విసిరే సమయంలోనే అతడికి ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో, అమాంతం కిందపడిపోయాడు. అతడలా పడిపోవడం చూసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తూ యాసిన్ అప్పటికే మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో యాసిన్ కుటుంబంలో, పట్టాన్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకూ తమతో ఉత్సాహంగా గడిపిన సహచరుడు అకాల మరణం చెందడంతో తోటి క్రికెటర్లు కన్నీళ్లు పెట్టకున్నారు.