Voters | న్యూఢిల్లీ, జనవరి 26: త్వరలో జరుగనున్న 18వ లోక్సభ ఎన్నికల్లో దాదాపు 96 కోట్ల మందికి పైగా పౌరులు ఓటేసేందుకు అర్హులుగా ఉన్నారు. వీరిలో 47 కోట్ల మంది మహిళలు ఉన్నారని, మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మందికి పైగా 18-19 ఏండ్ల వయస్కుల వారేనని ఎన్నికల సంఘం పేర్కొన్నది.
ఓటర్ల జాబితాలో నమోదైన వారిలో దాదాపు 18 లక్షల మంది దివ్యాంగులు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కోసం దాదాపు 1.5 కోట్ల మంది ఎన్నికల సిబ్బందిని కేటాయించనున్నారు.