ICC : శ్రీలంక యువకెరటం కమిందు మెండిస్(Kamindu Mendis) ఐసీసీ అవార్డుకు నామినేట్ య్యాడు. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్ రికార్డు సెంచరీలు బాదిన కమిందు మార్చి నెలకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) బరిలో నిలిచాడు. గురువారం ఐసీసీ నామినీస్ పేర్లను వెల్లడించింది. కమిందుతో పాటు న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, మార్క్ అడైర్(ఐర్లాండ్)లు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.
ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అషే గార్డ్నర్, మహియా బౌచియర్(ఇంగ్లండ్), న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కేర్లు బరిలో ఉన్నారు. మహిళలు, పురుషుల విభాగంలో నామినేట్ అయిన ఆటగాళ్లలో విజేతను ఎవరో మరోవారంలో తెలియనుంది. ఓటింగ్లో అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించిన వాళ్లు అవార్డు అందుకుంటారు.
🔸 Tearaway Blackcaps pacer
🔸 Ireand’s ace speedster
🔸 Sri Lanka’s rising starPresenting the ICC Men’s Player of the Month Award nominees for March 2024 👇
— ICC (@ICC) April 4, 2024
బంగ్లాదేశ్ గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్లో కమిందు ఓ రేంజ్లో చెలరేగాడు. ఏడోస్థానంలో బ్యాటింగ్కు వచ్చి రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీ బాదాడు. దాంతో, 147 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కమిందు రికార్డు నెలకొల్పాడు.
కమిందు మెండిస్
అఫ్గనిస్థాన్తో జరిగిన ఏకైక టెస్టులో అడాయిర్ సంచలన స్పెల్ వేశాడు. 39 పరుగులకే ఐదు వికెట్లు కూల్చి ఐర్లాండ్ విజయానికి బాటలు వేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో కివీస్ పేసర్ హెన్రీ నిప్పులు చెరిగాడు. 15.7 ఎకానమీతో ఏకంగా 17 వికెట్లు పడగొట్టాడు.
🏴 🇦🇺 🇳🇿
Three top performers from March 2024 are vying for ICC Women’s Player of the Month Award 🏅
— ICC (@ICC) April 4, 2024
రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు అందుకున్న అష్ గార్డ్నర్ బంగ్లా పర్యటనలో అద్భుతంగా రాణించింది. 52 పరుగులు చేయడమే కాకుండా 8 వికెట్లు పడగొట్టింది. నిరుడు ఫిబ్రవరిలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలిచిన అమేలియా.. ఈ మధ్యే ముగిసిన ఇంగ్లండ్ సిరీస్ రఫ్ఫాడించింది. నాలుగు ఇన్నింగ్స్ల్లో 114 రన్స్తో మూడో టాప్ స్కోరర్గా నిలిచింది. ఇక మిడిలార్డర్ బ్యాటర్ అయిన బౌచియర్ టీ20ల్లో అత్యధిక స్కోర్ కొట్టింది. 96 పరుగులతో రాణించి ఇంగ్లండ్కు భారీ స్కోర్ అందించింది.