Sridevi Biopic | దివంగత నటి, అందాల తార శ్రీదేవి బయోపిక్ విషయంపై బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రతికున్నంత కాలం తన భార్య శ్రీదేవి బయోపిక్ తీయలేరని తెలిపాడు. గత కొన్ని రోజులుగా శ్రీదేవి బయోపిక్ రానున్నట్లు బీ టౌన్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా బోనీ కపూర్ స్పందించారు.
అజయ్ దేవ్గణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘మైదాన్. ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా బోనీ మాట్లాడుతూ.. నా భార్య పర్సనల్ లైఫ్కు చాలా ప్రాధాన్యత ఇచ్చేది. పర్సనల్ విషయాలను బయటికి తెలియాల్సిన అవసరం లేదని తన అభిప్రాయం. అందుకే ఆమె ఆలోచలను, వ్యక్తిత్వాన్ని నేను చాలా గౌరవిస్తాను. బయోపిక్ అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంది. అందుకే నా భార్య ఆలోచనల ప్రకారం తన బయోపిక్ తీయడానికి నేను ఒప్పుకొను. నేను బ్రతికున్నంత కాలం ఆమె బయోపిక్ రాదు. అంటూ బోనీ కపూర్ వెల్లడించారు.
ఇక మైదాన్ సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇండియన్ లెజెండరీ ఫుట్బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతుంది. ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, గజ్రాజ్ రావ్. రుద్రానిల్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ సంస్థ, బోనికపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.