అమరావతి : ఏపీలో ఇటీవల బదిలీ అయిన కలెక్టర్(Collectors), ఎస్పీ (SPs) స్థానాల్లో ఎన్నికల సంఘం కొత్తవారిని నియమించింది. కొత్తగా నియమించబడ్డ అధికారులందరూ ఈ రోజు రాత్రి 8 గంటల్లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా (Krishna District) జిల్లా కలెక్టర్గా డికె. బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వి. వినోద్కుమార్, ఎస్పీగా అమిత్ బర్దార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్కుమార్, గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.