IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణకు అడ్డంకులు తొలగడం.. సోమవారం బీసీసీఐ (BCCI) కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో క్రీడా వినోదం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మే 17 నుంచి లీగ్ కొనసాగుతుందని చెప్పిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికల్ని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ(Narendra Modi) స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఫైనల్ ఒక్కటే కాదు క్వాలిఫయర్ 2 కూడా ఇక్కడే జరుగనుందని సమాచారం. వాతావరణ పరిస్థితులు, వర్ష సూచన(Rain Forecast)ను పరిగణనలోకి తీసుకొని ప్లే ఆఫ్స్ వేదికల్ని నిర్ణయించాలని బీసీసీఐ భావిస్తోందట. అందుకే.. జూన్ మొదటి వారం అహ్మదాబాద్లో వర్షాలు కురిసే అవకాశం లేదట. సో.. అక్కడే నాకౌట్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించేందుకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారని టాక్.
🗓️ #TATAIPL 2025 action is all set to resume on 17th May 🙌
The remaining League-Stage matches will be played across 6⃣ venues 🏟️
The highly anticipated Final will take place on 3rd June 🏆
Details 🔽https://t.co/MEaJlP40Um pic.twitter.com/c1Fb1ZSGr2
— IndianPremierLeague (@IPL) May 12, 2025
తొలి రెండు ప్లే ఆఫ్స్లో.. ఒకటి ముంబైలోని వాంఖడేలో ఆడిస్తారనే సమాచారం ఉంది. కానీ, ఇప్పటికే ముంబైలో రెండు మూడుసార్లు వానలు పడ్డాయి. దాంతో, వాంఖడేలో ఆడిస్తే.. వర్షం కారణంగా మ్యాచ్లు రద్దయితే జట్లు కీలక పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే.. వర్ష సూచన లేని ఢిల్లీ, జైపూర్, లక్నో నగరాల్లో ప్లే ఆఫ్స్ నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతోంది.
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 18వ సీజన్ వారం వాయిదా పడింది. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరిచండంతో.. లీగ్ను కొనసాగించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అయితే… షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. మిగిలిన 17 లీగ్ మ్యాచులను ఆరు నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోల్కతా, చెన్నై, హైదరాబాద్ వేదికగా ఒక్క గేమ్ కూడా జరగడం లేదు.
అందుకు కారణం ఏంటంటే.. సీఎస్కే, ఆరెంజ్ ఆర్మీలు.. సొంత ఇలాకాలో ఒకే ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, ఒక్క మ్యాచ్ కోసం బ్రాడ్కాస్టింగ్ పరికరాలను మోసుకెళ్లేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. మొహాలి, ధర్మశాలలో మ్యాచ్లు జరిపేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. మే 17న 18వ సీజన్ పునఃప్రారంభం కానుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతాను ఢీ కొట్టనుంది.