IOA : భారత ఒలింపిక్స్ సంఘం కొత్త సీఈఓ(CEO)గా రఘురామ్ అయ్యర్(Raghuram Iyer) నియమితులయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో పలు ఫ్రాంచైజీలకు సీఈఓగా పనిచేసిన అనుభవం రఘురామ్ సొంతం. నామినేషన్ కమిటీ కూడా ఆయన వైపే మొగ్గు చూపింది. దాంతో, శుక్రవారం ఐఓఏ రఘురామ్ను నూతన సీఈఓగా ప్రకటించింది.
‘రఘురామ్ అయ్యర్ కొత్త సీఈఓగా ఎంపికయ్యాడనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దరఖాస్తులను సునిశితంగా పరిశీలించిన నామినేషనల్ కమిటీ సమర్ధుడైన అయ్యర్ పేరును సూచించింది అని’ ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష(PT Usha) తెలిపింది.
‘తన అనుభవం, నాయకత్వ పటిమతో రఘురామ్ భారత క్రీడారంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారిని ఆశిస్తున్నాం. ఆయన సీఈఓగా ఎంపకివ్వడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు విజయం దిశగా తొలి అడుగు పడింది’ అని ఉష వెల్లడించింది. రఘురామ్కు ఐపీఎల్తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన గతంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్(LSG), రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు సీఈఓగా సేవలందించారు.