Rinku Singh : ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన రింకూ సింగ్(Rinku Singh) ఫినిషర్గా అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్లో రింకూ తన మార్క్ షాట్లతో జట్టును గెలిపించాడు. క్రీజులోకి వచ్చిందే ఆలస్యం సిక్లర్సతో విరుచుకుపడే ఈ లెఫ్ట్ హ్యాండర్ రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లోనూ ఇరగదీస్తున్నాడు.
కేరళతో జరుగుతున్న మ్యాచ్లో రింకూ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 136 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగుల కీలక ఇన్నింగ్స్తో ఉత్తరప్రదేశ్ జట్టును ఆదుకున్నాడు. రింకూ, ధ్రువ్ జురెల్(63)తో రాణించడంతో యూపీ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, కేరళ బౌలర్ల విజృంభణతో 302 పరుగులకే ఆలౌటయ్యింది.
Rinku Singh in whites.#RanjiTrophypic.twitter.com/HbBohwZGJr
— KnightRidersXtra (@KRxtra) January 5, 2024
రంజీ ట్రోఫీలో భాగంగా సనాతన ధర్మ కాలేజి గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో యూపీ బ్యాటింగ్ ఎంచుకుంది. కేరళ బౌలర్లు విజృంభించడంతో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రింకూ, ధ్రువ్ జురెల్(63)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.
మొదట్లో నిదానంగా ఆడినా కుదురుకున్నాక ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్లిద్దరూ కలిసి ఆరో వికెట్కు 143 పరుగులు జోడించారు. జురెల్, రింకూ త్వరగా ఔటవ్వడంతో యూపీ 302 రన్స్కు పరిమితమైంది. కేరళ బౌలర్లలో నిదీశ్ మూడు.. బసిల్ తంపి, జలజ్ సక్సేనా రెండేసి వికెట్లు పడగొట్టారు.