న్యూఢిల్లీ: దేశమంతా రామ జపం మారుమోగుతోంది. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయాన్ని ఓపెన్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఓ సాంగ్ను షేర్ చేశారు. రాముడిపై యువ సింగర్ స్వస్తి మెహుల్ పాడిన రామ్ ఆయేంగే భజన ఫుల్ పాపులర్ అయ్యింది. రాముడికి అంకితం చేస్తూ ఆమె పాట పాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమె స్వరం రామ భకుల్ని గెలుచుకున్నది.
स्वस्ति जी का ये भजन एक बार सुन लें तो लंबे समय तक कानों में गूंजता रहता है। आंखों को आंसुओं से, मन को भावों से भर देता है। #ShriRamBhajan https://t.co/0nD3XmAbzk
— Narendra Modi (@narendramodi) January 6, 2024
ఆ సాంగ్పై మోదీ తన ట్వీట్లో ప్రశంసలు కురిపించారు. స్వస్తిజీ స్వరలో ఈ రామ కీర్తన వింటే , అది మన చెవుల్లో చాలా కాలం మారుమోగుతుందని, కండ్లల్లో నీళ్లు తిరుగుతాయని, భావోద్వేగాలతో మది నిండిపోతుందని ప్రధాని అన్నారు. ఆ సాంగ్ను ప్రధాని ట్వీట్ చేసిన గంటలోనే మూడు లక్షల వ్యూవ్స్ వచ్చాయి.