INDW vs AUSW : సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయం సాధించింది. వారం క్రితమే ఇంగ్లండ్ను మట్టికరిపించిన భారత్.. ఆస్ట్రేలియా(Australia)పై తొలి టెస్టు విజయం నమోదు చేసింది. ముంబైలోని వాంఖడేలో ఆసీస్తో జరిగిన ఏకైక టెస్టులో మొదటి రోజు నుంచి పట్టుబిగించిన హర్మన్ప్రీత్ కౌర్ సేన 75 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు నష్టపోయి ఛేదించి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఏడు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ స్నేహ్ రానా(Sneh Rana) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది
రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా 261 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన(38 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(12 నాటౌట్) ధనాధన్ ఆడి జట్టును గెలిపించారు.
🚨 INDIA’S FIRST WIN OVER AUSTRALIA IN A WOMEN’S TEST #INDVAUS
▶️ https://t.co/uaFLxAnKj5 pic.twitter.com/RekBNpafAu
— ESPNcricinfo (@ESPNcricinfo) December 24, 2023
నాలుగో రోజు తొలి సెషన్లో భారత జట్టు పేసర్లతో బౌలింగ్ దాడి ఆరంభించింది. కొద్ది సేపటికే డేంజరస్ అష్ గార్డ్నర్(7)ను పూజా వస్త్రాకర్ ఎల్బీగా ఔట్ చేసింది. ఆ తర్వాత స్నేహ్ రానా ఒకే ఓవర్లో సథర్లాండ్(27), అలనా కింగ్(0)ను పెవిలియన్ పంపింది. జెస్ జొనాసెన్(9)ను రాజేశ్వరీ గైక్వాడ్ బౌల్డ్ చేయడంతో కంగారూల ఇన్నింగ్స్ 261 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా నాలుగు, రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టారు.
A thorough performance helped India to a maiden Test win over Australia 🤩#INDvAUS 📝: https://t.co/7IhQWMwQaU pic.twitter.com/t7TAdcHqh6
— ICC (@ICC) December 24, 2023
మూడో రోజైన శనివారం ఆసీస్ ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 376/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 406 పరుగులకు ఆలౌటైంది. ఆల్రౌండర్లు దీప్తిశర్మ(78), పూజ వస్త్రాకర్(47) తర్వగా పెలిలియన్ చేరారు. అనంతరం 30 పరుగుల వ్యవధిలో టీమిండియా ఆఖరి మూడు వికెట్లు కోల్పోయింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాపై భారత్ అత్యుత్తమ స్కోరు కొట్టింది.