ICC : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు. ఇంగ్లండ్ సిరీస్లో ఇరగదీసిన ఈ చిచ్చరపిడుగు ఫిబ్రవరి నెలకుగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'(Player Of The Month) అవార్డు అందుకున్నాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సథర్లాండ్(Annabel Sathurland) విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో సథర్లాండ్ డబుల్ సెంచరీతో చెలరేగింది. దాంతో, ఆమె యూఏఈ క్రికెటర్లను దాటేసి అవార్డు అందుకుంది.
ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో 22 ఏండ్ల యశస్వీ పరుగుల వరద పారించాడు. రెండు డబుల్ సెంచరీలతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఓటింగ్లో కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంకలను వెనక్కి నెట్టి మరీ యశస్వీ విజేతగా అవతరించాడు.
Presenting the ICC Player of the Month for February 🙌
Congratulations, Yashasvi Jaiswal 👏👏
🗣️🗣️ Hear from the #TeamIndia batter on receiving the award@ybj_19 pic.twitter.com/tl1tJepdFJ
— BCCI (@BCCI) March 12, 2024
‘ఐసీసీ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఈ అవార్డులు మరిన్ని సాధిస్తా. ఇంగ్లండ్ సిరీస్ను నేను ఎంతో ఆస్వాదించా. ఆ ఐదు టెస్టుల సిరీస్ నా కెరీర్లో ఎంతో ఉత్తమమైనది. నేను నా స్టయిల్లోనే ఆడాను. మేము 4-1తో సిరీస్ గెలిచాం. జట్టు సభ్యులతో పాటు ఆ విజయాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను’ అని యశస్వీ వెల్లడించాడు.
Australia’s star all-rounder wins the ICC Women’s Player of the Month award following an outstanding record-breaking performance in February 🔥
Read on 👇
— ICC (@ICC) March 12, 2024
యశస్వీ ఈ మధ్యే టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా చిన్న తక్కువ వయసులోనే ఈ మైలురాయికి చేరిన రెండో భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ చిచ్చరపిడుగు 16 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించగా.. మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(Vinod Kambli) 14 ఇన్నింగ్స్ల్లోనే వెయ్యి రన్స్ కొట్టాడు. నయా వాల్గా పేరొందిన ఛతేశ్వర్ పూజారా 18 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు.