Womens T20 WC : వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో భారత మహిళల జట్టు చోటు దక్కించుకుంది. మొత్తం ఆరు జట్లు క్వాలిఫై అయినట్టు ఐసీసీ ప్రకటించింది. గ్రూప్ – 1, గ్రూప్ -2లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు వరల్డ్ కప్ టోర్నమెంట్కు నేరుగా అర్హత సాధించాయి. గ్రూప్ -1 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్.. గ్రూప్ -2 నుంచి భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి.
అయితే.. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్ అర్హత సాధించలేదు. ఈ మెగా టోర్నీకి మొత్తం ఎనిమిది జట్లు క్వాలిఫై కావాల్సి ఉంది. దాంతో, ఐసీసీ త్వరలోనే ఆ రెండు జట్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అలాంటిది ఆ జట్టు టోర్నమెంట్కు క్వాలిఫై కాకపోవడంతో ఆ దేశ అభిమానులు నిరాశ చెందారు. అంతేకాదు శ్రీలంక, ఐర్లాండ్ జట్లు మాత్రమే 2023 వరల్డ్ కప్కి క్వాలిఫై కాలేదు. ప్రస్తుతం టీ 20 ర్యాంకింగ్స్లో ఈ రెండు జట్లు వరసగా ఎనిమిది, పది స్థానాల్లో ఉన్నాయి.
కేప్టౌన్లోని న్యూలాండ్స్లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా అవతరించింది. దక్షిణాఫ్రికాను 19 పరుగులతో ఓడించింది. ఆరోసారి పొట్టి ప్రపంచ కప్ అందుకుంది. బేత్ మూనీ (74 నాటౌట్) అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆసీస్ కెప్టెన్ మేగ్ లానింగ్ అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెల్చిన కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేసింది. ఆమె సారథ్యంలో ఆ జట్టు మూడు వరల్డ్ కప్పులు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు నెగ్గింది.దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీమిండియా పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. 163 లక్ష్య ఛేదనలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అర్ధ శతకం కొట్టినా లాభం లేకపోయింది. 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది.