హరారే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే జట్టు ఆలౌట్ అయింది. ఆరంభంలో పేసర్లు రాణించడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సికందర్ రజా (16), షాన్ విలియమ్స్ (42) ఇద్దరూ కాసేపు ఆదుకున్నారు. విలియమ్స్ అవుటైన తర్వాత ర్యాన్ బర్ల్ (39 నాటౌట్) కూడా రాణించాడు.
అయితే మిగతా బ్యాటర్లు కైటానో (7), ఇన్నొసెంట్ కాయా (16), మధెవెరె (2), రెగీస్ చాకబ్వా (2), ల్యూక్ జాంగ్వే (6), బ్రాడ్ ఎవాన్స్ (9), విక్టర్ న్యూచీ (0), తనక చివాంగ (4) ఎవరూ రాణించలేదు. దీంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకోగా.. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీసుకున్నారు.
India need 162 runs to win second ODI match against Zimbabwe.#INDvZIM #KlRahul #CricketTwitter pic.twitter.com/RK9L9YQ7P4
— Crictips (@CrictipsIndia) August 20, 2022