ఆసియా కప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో హాంకాంగ్ జట్టు టాస్ గెలిచింది. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హాంకాంగ్ సారధి నిజాకత్ ఖాన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అంతకుముందు యూఏఈతో ఆడిన జట్టుతోనే తాము బరిలో దిగుతున్నట్లు చెప్పాడు. తాను టాస్ గెలిచి ఉంటే తను కూడా బౌలింగ్ తీసుకునేవాడినని రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చామని, అతని స్థానంలో రిషభ్ పంత్ ఆడుతున్నాడని చెప్పాడు.
టీమిండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, ఆవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
A look at #TeamIndia’s playing today. 📌
1 change as Hardik Pandya has been rested and Rishabh Pant replaces him. https://t.co/9txNRez6hL… #INDvHK #AsiaCup2022 pic.twitter.com/jLYqBBja3R
— BCCI (@BCCI) August 31, 2022